మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి: తెలంగాణ డీహెచ్
ABN , First Publish Date - 2022-04-21T21:21:02+05:30 IST
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనా
హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనా, తైవాన్, ఈజిప్టు వంటి దేశాలతో పాటు ఢిల్లీ, హర్యానా, యూపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని పేర్కొన్నారు. రోజుకు 20-25 కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించాలని డీహెచ్ సూచించారు. ఫోర్త్వేవ్పై అనేక అనుమానాలు ఉన్నాయని, సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్ వేవ్ రాదని డీహెచ్ తెలిపారు.