హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో పెరిగిపోతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-13T12:00:57+05:30 IST
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ : కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ జోన్ల పరిధిలోని కరోనా పరీక్ష కేంద్రాల్లో 1465 మందికి పరీక్ష చేయగా 345 మందికి పాజిటివ్గా తేలింది. సరూర్నగర్లోని ఆస్పత్రిలో సోమవారం 208 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ అర్చన తెలిపారు. మన్సూరాబాద్లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 120 మందికి కరోనా రాపిడ్ యాంటీజన్ పరీక్షలు నిర్వహించారు. అందులో 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. బాలాపూర్ కేంద్రంలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా 45 మందికి పాజిటివ్గా తేలింది.
అబ్దుల్లాపూర్మెట్ కేంద్రంలో 68 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి కరోనా సోకింది. మలక్పేట ఆరోగ్య కేంద్రంలో 78 మందికిగా ను 12 మందికి పాటిటివ్ వచ్చింది. శాలివాహననగర్ లో 69 మందికిగాను 18 మంది పాజిటివ్గా గుర్తించా రు. మాదన్నపేటలో 87మందికి గాను 13మందికి పాజిటివ్ వచ్చింది. జాంబాగ్లో 122మందికి గాను 16 మందికి పాజిటివ్గా తేలింది. గడ్డిఅన్నారంలో 105 మందికిగాను 29 మందికి పాజిటివ్గా తేలింది. అజంపురలో 100 మందికి టెస్ట్లు నిర్వహించగా 26 మం దికి పాజిటివ్గా వచ్చింది. హయత్నగర్ కేంద్రంలో 82మందికి పరీక్షలు నిర్వహించగా 17మందికి పాజిటివ్గా తేలింది. వనస్థలిపురం కేంద్రంలో 251 మందికి పరీక్షలు చేయగా 101మందికి పాజిటివ్ వచ్చింది.