భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-01T15:47:34+05:30 IST
భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్నటి వరకూ 10 వేల లోపే ఉన్న కరోనా కేసులు..
ఢిల్లీ : భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్నటి వరకూ 10 వేల లోపే ఉన్న కరోనా కేసులు.. నిన్న 20 వేలకు పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 406 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,04,781కి చేరింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1,431కి చేరింది.