విశాఖ పట్నం: కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-08-27T00:34:25+05:30 IST
జిల్లాలోని ఎస్ రాయవరం మండలం పేట సూదిపురంలో కరోనా
విశాఖ పట్నం: జిల్లాలోని ఎస్ రాయవరం మండలం పేట సూదిపురంలో కరోనా కలకలం సృష్టించింది. గ్రామంలోని యూపీఎస్ స్కూల్లో ఆరవ తరగతి విద్యార్థినికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. స్కూల్ ఆవరణను అధికారులు శానిటైజ్ చేయించారు.