తిరుపతి : రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-07-12T00:29:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజూ వేలసంఖ్యలో కొత్త కేసులు

తిరుపతి : రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజూ వేలసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తిరుపతిలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో తిరుపతి అర్బన్ 144, రూరల్ 28 కేసులు నమోదవ్వడం జిల్లా వాసులను ఆందోళన కలిగిస్తోంది.


ఇక చిత్తూరు జిల్లా విషయానికొస్తే.. కొత్తగా 300 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపితే జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2509కు చేరుకుంది. ఇప్పటి వరకూ 1126 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ప్రస్తుతం 1364 మంది మాత్రమే జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరణాల సంఖ్య జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో 19 మంది జిల్లా వ్యాప్తంగా మృతి చెందారు.


ఇదిలా ఉంటే.. శనివారం నాడు కేసులతో పాటు మరణాలు కూడా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కరోనాతో 17 మంది చనిపోయారంటే... కోవిడ్ ఉధృతి రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1813 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు వచ్చిన కేసులతో కలిపి మొత్తం 27,235 మందికి రాష్ట్రంలో కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న14,393 మంది డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 12,533 యాక్టివ్ కేసులన్నాయి.

Updated Date - 2020-07-12T00:29:17+05:30 IST