Delhi: దేశంలో కొత్తగా 42వేలకు పైగా కరోనా కేసులు..

ABN , First Publish Date - 2021-08-04T17:10:05+05:30 IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు నమోదు కాగా, 562 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు

Delhi: దేశంలో కొత్తగా 42వేలకు పైగా కరోనా కేసులు..

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు నమోదు కాగా, 562 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. కరోనాతో మొత్తం 4,25,757 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 36,668 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్ కేసులు ఉండగా, 3.09 కోట్ల మంది రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 48.52 కోట్ల మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది.

Updated Date - 2021-08-04T17:10:05+05:30 IST