తమిళనాడులో 15వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-24T03:47:05+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

తమిళనాడులో 15వేలు దాటిన కరోనా కేసులు

చెన్నై: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 759 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,512కు చేరినట్లు వారు తెలిపారు. అలాగే కొత్తగా ఐదుగురు కరోనాకు బలవడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 103కు చేరింది. కాగా, తమిళనాడులో ప్రస్తుతం 7,915 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు సమాచారం.

Updated Date - 2020-05-24T03:47:05+05:30 IST