రాజస్థాన్లో 5వేలు దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-18T00:51:26+05:30 IST
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్లో కరోనా కేసుల సంఖ్య 90వేలు దాటింది.
జైపూర్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్లో కరోనా కేసుల సంఖ్య 90వేలు దాటింది. ఈ వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో కొత్తగా 123 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,083కు చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్ ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటి వరకు రాజస్థాన్లో 128మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.