కోరలు చాస్తున్న కరోనా.. 9 మంది మృత్యువాత
ABN , First Publish Date - 2020-08-08T21:00:41+05:30 IST
కరోనా పాజటివ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. శుక్రవారం 941 మంది కరోనా పాజిటివ్ బాధితులు నమోదయ్యారు. దీంతో జిల్లాలో 12వేలు వాటి 12,165 కేసులు నమోదయ్యాయి.
తాజాగా 941 పాజిటివ్లు.. 363 మంది డిశ్చార్జి
12,165కు చేరుకున్న బాధితులు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి): కరోనా పాజటివ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. శుక్రవారం 941 మంది కరోనా పాజిటివ్ బాధితులు నమోదయ్యారు. దీంతో జిల్లాలో 12వేలు వాటి 12,165 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనాతో చికిత్స పొందుతూ 9 మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు ప్రకాశ్నగర్కు చెందిన 82 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు రాంనగర్కు చెందిన 67 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు వీఆర్సీ సెంటర్కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు గుడపల్లిపాడుకు చెందిన 74 ఏళ్ల వ్యక్తి, బాలాజీనగర్కు చెందిన 66 ఏళ్ల మహిళ, నెల్లూరు స్టోన్హౌస్పేటకు చెందిన 69 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు దొర్నాల వీధికి చెందిన 61 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు బీవీనగర్కు చెందిన 80 ఏళ్ల వ్యక్తి, సీతారాంపురానికి చెందిన 85 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నారాయణ, కోవిడ్ సెంటర్ల నుంచి 363 మందిని డిశ్చార్జ్ చేశారు.
సూళ్లూరుపేటలో 15 కేసులు
పొదలకూరులో ఒకేరోజు 8 పాజిటివ్లు
చిల్లకూరు మండలంలో 15 కేసులు
వాకాడులో ఐదుగురికి
కోటలో 29 మందికి..
రాపూరులో 15 కరోనా కేసులు
బోగోలులో 10 పాజిటివ్లు
ఉదయగిరిలో 22 కేసులు
ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో తొలి కరోనా కేసు