నెల్లూరు జిల్లాలో కొత్తగా 466మందికి పాజిటివ్.. మరో ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2020-09-27T18:05:35+05:30 IST
జిల్లాలో కరోనా కేసుల నమోదు అవుతూనే ఉన్నాయి. శనివారం తాజాగా..
నెల్లూరు: జిల్లాలో కరోనా కేసుల నమోదు అవుతూనే ఉన్నాయి. శనివారం తాజాగా 466 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 52,059 కరోనా కేసులు నమోదు అయ్యాయి, కరోనా కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇందులో నెల్లూరుకు చెందిన ఇద్దరు, కావలికి చెందిన ఒకరు ఉన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నెల్లూరు, నారాయణ ఆసుపత్రి, కొవిడ్ కేర్ సెంటర్లకు చెందిన 477 మందిని అధికారులు డిశ్చార్జ్ చేశారు.