నెల్లూరులో మృత్యు ఘోష.. కరోనాకు మరో 10 మంది బలి

ABN , First Publish Date - 2020-08-15T20:47:46+05:30 IST

కరోనా మహమ్మారి నిత్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. వైరస్‌ విలయానికి ..

నెల్లూరులో మృత్యు ఘోష.. కరోనాకు మరో 10 మంది బలి

200 దాటిన మృతులు

16688కి చేరిన పాజిటివ్‌లు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి నిత్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది.  వైరస్‌ విలయానికి జిల్లాలో మృత్యు ఘోష వినిపిస్తోంది. తాజాగా మరో పది మంది ఆ క్రిమి కాటుకు బలి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్‌ కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 205కు చేరింది. శుక్రవారం నెల్లూరు గుడపల్లిపాడుకు చెందిన 61 ఏళ్ల వ్యక్తి,  ఏకే నగర్‌కు చెందిన 75, 79 ఏళ్ల వ్యక్తులు, ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ, కొడవలూరుకు చెందిన 65 ఏళ్ల మహిళ, కావలి జనతాపేటకు చెందిన 47 ఏళ్ల వ్యక్తి, నాయుడుపేటకు చెందిన  71, 54 ఏళ్ల వ్యక్తులు, గూడూరుకు చెందిన 59 ఏళ్ల వ్యక్తి, ప్రకాశం జిల్లాకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. అదేవిధంగా మరో 669 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 16,688గా నమోదయ్యాయి. కాగా, కొవిడ్‌ నుంచి కోలుకున్న 711 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.


Updated Date - 2020-08-15T20:47:46+05:30 IST