నెల్లూరును వణికిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-08-09T16:09:03+05:30 IST

కరోనా కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. పాజిటివ్‌ కేసుల ఉధృతి..

నెల్లూరును వణికిస్తున్న కరోనా

తాజాగా  878 పాజిటివ్‌లు

13,043కు చేరుకున్న బాధితులు

8 మంది మృత్యువాత

247 మంది డిశ్చార్జి


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. పాజిటివ్‌ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.  శనివారం 13 వేల కేసులను దాటి 13,043 కరోనా పాజిటివ్‌ కేసులకు చేరుకుంది. తాజాగా 878 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే 8 మంది కరోనాతో మృత్యువా త పడ్డారు. నెల్లూరు చంద్రమౌళినగర్‌కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు కల్లూరుపల్లికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు దండువారివీధికి చెందిన 62 ఏళ్ల మహిళ, నెల్లూరు పెద్దబజార్‌కి చెందిన 90 ఏళ్ల వ్యక్తి, నగరానికే చెందిన 86 ఏళ్ల వ్యక్తి, కావలి పోలేటివారివీధికి చెందిన 70 ఏళ్ల వ్యక్తి,  బుచ్చిరెడ్డిపాళెం గాంధీనగర్‌కి చెందిన 24 ఏళ్ల యువకుడు, బుచ్చికే చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా మృతిచెందారు.  ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నారాయణ, నెల్లూరు ఆసుపత్రి, కొవిడ్‌ సెంటర్‌లలో చికిత్స పొందుతున్న 247 మందిని అధికారలు డిశ్చార్జి చేశారు.


డీవీసత్రంలో ఒక కరోనా కేసు 

సూళ్లూరుపేటలో 17 మందికి కరోనా

బుచ్చిలో 29 పాజిటివ్‌లు

ఉదయగిరిలో 12  కేసులు

వరికుంటపాడులో ఇద్దరికి పాజిటివ్‌

కొండాపురంలో 5 పాజిటివ్‌లు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-09T16:09:03+05:30 IST