కర్నూలు జిల్లాలో కొత్తగా 144మందికి పాజిటివ్..
ABN , First Publish Date - 2020-09-30T17:05:03+05:30 IST
జిల్లాలో మంగళవారం 144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు..
కర్నూలు: జిల్లాలో మంగళవారం 144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 55942కు చేరింది. వీరిలో కొవిడ్ ఆసుపత్రుల్లో 1689 మంది చికిత్స పొందుతుండగా.. 53,791 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల నుంచి జిల్లాలో కరోనా మరణాలు సంభవించలేదు. కర్నూలు నగర పాలక సంస్థలో పని చేస్తున్న ఓ అధికారికి కరోనా సోకడం కలకలం రేపింది. దీంతో ఆ అధికారి హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.