కృష్ణా జిల్లాలో కొత్తగా 338మందికి కరోనా.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-08-15T17:17:18+05:30 IST

కృష్ణా జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 338మందికి..

కృష్ణా జిల్లాలో కొత్తగా 338మందికి కరోనా.. ఇద్దరు మృతి

విజయవాడ(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 338మందికి వైరస్ సోకింది. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితులు మరణించారు. వీరితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 11783కు చేరాయి. కరోనా మరణాలు అధికారికంగా 220కు చేరాయి. ఇప్పటివరకు 7754మంది వ్యాధి నుంచి కోలుకోగా, ఇంకా 4009మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-08-15T17:17:18+05:30 IST