కృష్ణాలో.. కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-08-03T12:12:40+05:30 IST
జడలు విప్పిన కరోనా మహమ్మారి మళ్లీ జూలు విదిల్చింది. గడిచిన 24 గంటల్లో..
కొత్తగా 379 మందికి పాజిటివ్
ఒక్కరోజే 11 మంది మృతి
ఆంధ్రజ్యోతి, విజయవాడ: జడలు విప్పిన కరోనా మహమ్మారి మళ్లీ జూలు విదిల్చింది. గడిచిన 24 గంటల్లో 11 మందిని బలి తీసుకుంది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాలను జిల్లాలవారీగా పరిశీలిస్తే కృష్ణాజిల్లాలోనే అత్యధికంగా నమోదు కావడం, కొత్తగా మరో 379 మంది వైరస్ బారినపడటం ఆందోళన కలిగించే అంశం. రోజూ పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో జిల్లాలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆదివారం కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ బాధితుల సంఖ్య 7,579కు చేరింది. మరణాల సంఖ్య 175గా ఉంది. 24 గంటల్లో 136 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, 2,540 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.