దేశంలో కొత్తగా 6,358 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-12-28T15:40:05+05:30 IST

గడచిన 24 గంటలో భారత్‌లో కొత్తగా 6,358 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

దేశంలో కొత్తగా 6,358 కరోనా కేసులు

న్యూఢిల్లీ: గడచిన 24 గంటలో భారత్‌లో కొత్తగా 6,358 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 75,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కోవిడ్ రీకవరి రేటు 98.40 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 653కి  చేరింది. వైరస్ నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్ర 167, ఢిల్లీ 165, కేరళ 57, తెలంగాణ 55, గుజరాత్ 49, రాజస్తాన్ 46, తమిళనాడు 34, కర్నాటక 31, మధ్యప్రదేశ్ 9 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. 


Updated Date - 2021-12-28T15:40:05+05:30 IST