ఆరు రోజుల్లో 2,826 మందికి... హైదరాబాద్‌లో కరోనా లెక్కలివీ..!

ABN , First Publish Date - 2020-08-07T15:18:22+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభణ తగ్గడం లేదు. గ్రేటర్‌లో తాజాగా 535 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఆరు రోజుల్లో 2,826 మందికి... హైదరాబాద్‌లో కరోనా లెక్కలివీ..!

గ్రేటర్‌లో తాజాగా 535 మందికి పాజిటివ్‌


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విజృంభణ తగ్గడం లేదు. గ్రేటర్‌లో తాజాగా 535 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు కేసులు తగ్గినా.. మళ్లీ పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు రోజుల్లో 2,826 మంది కి వైరస్‌ సోకింది. జూలై నెలతో పోల్చుకుంటే కాస్త తక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తగ్గలేదు.  


1వ తేదీ 578

2..  517

3.. 273

4.. 391

5.. 532

6.. 535

మొత్తం 2,826


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 994 కరోనా కేసులు

కొవిడ్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 994 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 559, రంగారెడ్డిలో 415 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌లో 20 కేసులు నమోదు కాగా వీరిలో ఇద్దరు మృతి చెందారు. 

Updated Date - 2020-08-07T15:18:22+05:30 IST