‘తూర్పు‘లో కలకలం.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే..

ABN , First Publish Date - 2020-09-20T16:50:40+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. కేసులు ఎక్కడా తగ్గే పరిస్థితి..

‘తూర్పు‘లో కలకలం.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే..

కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. కేసులు ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతీ రోజూ వెయ్యి నుంచి 1400 వరకు పాజిటివ్‌  కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఈనెల 18న జిల్లావ్యాప్తంగా ట్రూనాట్‌ ద్వారా చేసిన కొవిడ్‌ పరీక్షల్లో 498 మందికి, రాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 897 మందికి.. మొత్తం 1,395 మందికి వైరస్‌ సోకిందని సూచించింది. ప్రస్తుతం ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 85,247 కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు కొవిడ్‌తో మృతి చెందడంతో మృతుల సంఖ్య 481కి చేరింది.


Updated Date - 2020-09-20T16:50:40+05:30 IST