చెన్నైలో 10వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-25T03:29:29+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

చెన్నైలో 10వేలు దాటిన కరోనా కేసులు

చెన్నై: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో చెన్నై నగరంలో కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ కొత్తగా 587 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క చెన్నైలోనే మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 10,567కు చేరింది. రాష్ట్రం మొత్తం మీద కొత్తగా 765 కేసులు నమోదవడంతో తమిళనాడులో రికార్డయిన కరోనా కేసుల సంఖ్య 16,277కు చేరింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 111కు చేరినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు.

Updated Date - 2020-05-25T03:29:29+05:30 IST