కరోనా ఎఫెక్ట్: బెంగాల్‌లో 20వేలకు చేరువైన కేసులు

ABN , First Publish Date - 2020-07-03T01:38:31+05:30 IST

బెంగాల్‌లో కరోనా కేసులు 20వేలకు చేరువయ్యాయి. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య నెమ్మదిగా...

కరోనా ఎఫెక్ట్: బెంగాల్‌లో 20వేలకు చేరువైన కేసులు

కలకత్తా: బెంగాల్‌లో కరోనా కేసులు 20వేలకు చేరువయ్యాయి. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు కూడా దాదాపు 650 మంది బాధితులను రాష్ట్రంలో కొత్తగా గుర్తించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 649 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. 509 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,819కి చేరింది. వీరిలో 6,083మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 13,037మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 699మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-07-03T01:38:31+05:30 IST