ఏపీలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-27T02:12:56+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో పెరిగిన కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 8,96,863కు కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం 4,145 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో  7,203 మరణాలు సంభవించాయి. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. గతాన్ని గుర్తు చేస్తూ భయపెడుతున్నాయి. టీకా కార్యక్రమం మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇదీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-03-27T02:12:56+05:30 IST