ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-26T23:15:37+05:30 IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి

ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 16,27,390కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 99 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 10,427 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,92,104 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 14,24,859 మంది రికవరీ అయ్యారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో కరోనాతో 15 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో 14, విజయనగరం జిల్లాలో 9, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. అలాగే గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. అయితే ఏపీలో 24 గంటల్లో కరోనా నుంచి 24,105 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 91,120 కరోనా టెస్టుల నిర్వహించారు.

Updated Date - 2021-05-26T23:15:37+05:30 IST