9 వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-03T10:48:14+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.

9 వేలు దాటిన కరోనా కేసులు

తాజాగా 448 పాజిటివ్‌లు

ఆరుగురు మృత్యువాత

48 మంది బాధితుల డిశ్చార్జి


నెల్లూరు(వైద్యం)ఆగస్టు 2 : కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.   తాజాగా ఏకంగా 9026 పాజిటివ్‌ కేసులకు చేరుకున్నాయి. ఆదివారం 448 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే మరో ఆరుగురు కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన 51 ఏళ్ల వ్యక్తి, కలిగిరి మండలం ముక్తాపురానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి, కావలి జెండావీధికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి, కావలి కేశవరాజువీధికి చెందిన 54 ఏళ్ల మహిళ, గూడూరుకు చెందిన 72 ఏళ్ల వ్యక్తి, కావలికే చెందిన 60 ఏళ్ల మహిళ కరోనాతో మృత్యువాత పడ్డారు. అలాగే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుంచి 48 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.

Updated Date - 2020-08-03T10:48:14+05:30 IST