తూ.గో జిల్లాలో 30వేలు దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-09T00:29:32+05:30 IST
జిల్లాలో కొవిడ్ విలయం సృష్టిస్తోంది. వేలాదిమందిని వరుసపెట్టి వైరస్ చుట్టుముట్టేస్తోంది. ప్రతిరోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యేలా చేస్తోంది. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల కలకలం
రాజమండ్రి: జిల్లాలో కొవిడ్ విలయం సృష్టిస్తోంది. వేలాదిమందిని వరుసపెట్టి వైరస్ చుట్టుముట్టేస్తోంది. ప్రతిరోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యేలా చేస్తోంది. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల కలకలం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి వరుసగా వస్తోన్న వేలాది పాజిటివ్ కేసులు కట్టడి కాకపోతాయా అని అధికారులు, వైద్యులు ఎదురుచూస్తున్నా జిల్లాలో ఎక్కడా ఆ ఛాయలే కనిపించడం లేదు. పల్లెలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా ఎక్కడికక్కడ పాజిటివ్లు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. జిల్లాలో శనివారం 1,310 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 30 వేల 160కి చేరింది. ఈరోజు కరోనా నుంచి 450 మంది కోలుకున్నారు.