మహారాష్ట్రలో 300 దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-01T02:10:47+05:30 IST

ఇక నాగర్‌లో మూడు.. పూణె, థానె, కళ్యాన్-దోంబిలి, నవీ ముంబై, వాశి, విరార్‌లలో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికర డాటా వెల్లడిస్తోంది.

మహారాష్ట్రలో 300 దాటిన కరోనా కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 300 దాటాయి. ఈ ఒక్కరోజే రాష్ట్రంలో 72 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసులు సంఖ్య పెరిగినట్లు మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ కేసుల్లో ఒక్క ముంబై నగరంలోనే 59 నమోదయ్యాయట. ఇక నాగర్‌లో మూడు.. పూణె, థానె, కళ్యాన్-దోంబిలి, నవీ ముంబై, వాశి, విరార్‌లలో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికర డాటా వెల్లడిస్తోంది.

Updated Date - 2020-04-01T02:10:47+05:30 IST