దేశవ్యాప్తంగా 58లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-25T16:05:49+05:30 IST

భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 58లక్షలు దాటాయి.

దేశవ్యాప్తంగా 58లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 58లక్షలు దాటాయి. గడచిన 24 గంటల్లో 86,052 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,141 మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 58,18,571 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 92,290 మంది మృతి చెందారు. కాగా దేశ వ్యాప్తంగా 9,70,116 కరోనా యాక్టివ్‌ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 47,56,165 మంది డిశ్చార్జ్ అయ్యారు.


నిన్న ఒక్కరోజే 81, 177 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.74 శాతం ఉండగా.. మరణాల రేటు 1.59 శాతంగా ఉందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌‌లో పేర్కొంది. అయితే గత 24గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 

Updated Date - 2020-09-25T16:05:49+05:30 IST