దేశంలో వరుసగా మూడో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-07T15:46:04+05:30 IST

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

దేశంలో వరుసగా మూడో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 3,915 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం 2.14 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 2.34 లక్షల మంది ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 36.45 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.95% ఉండగా.. మరణాల రేటు 1.09%గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16.49 కోట్ల మందికి కరోనా టీకాలు వేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Updated Date - 2021-05-07T15:46:04+05:30 IST