భారత్‌లో 8 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-10T16:36:51+05:30 IST

భారత్‌లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది.

భారత్‌లో 8 లక్షలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. 8 లక్షలకు చేరువలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది.గడిచిన 24 గంటల్లో 26,506 పాజిటీవ్ కేసులు నమోదుకాగా, 475 మంది మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా భారత దేశంలో మరణాల సంఖ్య 21.604కు చేరింది. యాక్టివ్ కేసులు 2,76,685 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 7,93,802 పాజిటీవ్ కేసులు నమోదుకాగా 4,95,512 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.


అయితే భారత దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిన్న కేంద్ర మంత్రివర్గం కరోనాపై సమీక్ష నిర్వహించింది. వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందించాలి.. అలాగే రాష్ట్రాల నుంచి ఎటువంటి వినతులు స్వీకరించాలి.. ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై చర్చలు జరిపింది.

Updated Date - 2020-07-10T16:36:51+05:30 IST