ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-22T00:49:26+05:30 IST

రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 13,212 కరోనా కేసులు

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 21,53,268కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 14,532 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 64,136 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి 20,74,600 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఎక్కడికక్కడ వ్యాపిస్తూ వేల మందిని చుట్టేస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమేపీ పెరిగిపోతోంది. దీంతో ఎక్కడ చూసినా మళ్లీ కొవిడ్‌ భయం అలుముకుంటోంది. మునుపటి సెకండ్‌ వేవ్‌ తరహాలో కేసులు పంజా విసురుతాయోమననే ఆందోళన అందరూ హడలిపోతున్నారు.

Updated Date - 2022-01-22T00:49:26+05:30 IST