48 పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-11-30T05:05:10+05:30 IST
జిల్లాలో మరో 48 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది.
కడప, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 48 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54511కు చేరింది. ఇప్పటి వరకు 521 మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న 60 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 53739 మంది డిశ్చార్జి అయ్యారు. 299 మంది హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు.