19 కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-11-29T05:19:40+05:30 IST
24 గంటల వ్యవధిలో 19 మందిలో కరోనా పాజిటివ్ వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.
కడప, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో 19 మందిలో కరోనా పాజిటివ్ వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,463కి చేరింది. ఇప్పటి వరకు 521 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 42 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 53,679 మంది డిశ్చార్జి అయ్యారు. 314 మంది హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు.