చిత్తూరులో.. దడపుట్టిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-08-03T13:58:56+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం..
మరో 566 మందికి పాజిటివ్
13299కు చేరిన మొత్తం కేసులు
తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు 566 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 73 కేసులు ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నమోదయ్యాయి. ఈ 73లో పలమనేరులో అత్యధికంగా 30, తిరుపతి 14, చిత్తూరులో7, ఇతర జిల్లాలకు చెందిన కేసులు 4 ఉన్నాయి. తాజా కేసులతో కరోనా పాజిటివ్ల సంఖ్య 13299 చేరాయి. తిరుపతిలో కేసులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో శిల్పారామంలో కొవిడ్ కాల్ సెంటర్ ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. వైరస్ సోకి చెన్నైలో చికిత్స పొందుతున్న పెద్దజియ్యర్స్వామి కోలుకుని తిరుపతిలోని తన మఠానికి చేరుకున్నారు.