నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-03-20T20:55:40+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఉయ్యాలవాడ

నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ

నాగర్ కర్నూలు: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో, తిమ్మాజీపేట మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు బయట పడడంతో ఆందోళన నెలకొంది. ఉయ్యాలవాడలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో గురుకుల పాఠశాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 9కి చేరింది. కొన్నిరోజుల క్రితం పాఠశాలలోని నలుగురు విద్యార్థులకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాలలో కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తమ పిల్లల్ని తిరిగి ఇంటికి తీసుకు వెళ్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే కేసులు పెరుగుతున్నా పిల్లలను ఇంటికి పంపించడానికి ప్రిన్సిపాల్ అనుమతించడం లేదు. 


తిమ్మాజీపేట మండల కేంద్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయురాలికి కరోనా సోకింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-03-20T20:55:40+05:30 IST