అమర్‌నాథ్‌ యాత్రకు కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-04-09T12:07:44+05:30 IST

అమర్‌నాథ్‌ యాత్రకు కరోనా దెబ్బ

అమర్‌నాథ్‌ యాత్రకు కరోనా దెబ్బ

హైదరాబాద్/బర్కత్‌పుర: మంచులింగ దర్శనం కోసం ఏటా జరిగే అమర్‌నాథ్‌ యాత్రపై కరోనా నీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 23 నుంచి ఆగస్టు 3 వరకు సాగుతుందని అమర్‌నాథ్‌ షైన్‌బోర్డు మార్చిలో ప్రకటించింది. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు చేసుకోచ్చునని కూడా చెప్పింది. ఇంతలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో  ఈ ఏడాది యాత్ర ఉంటుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-04-09T12:07:44+05:30 IST