బ్రేకింగ్: ఏపీలో కరోనా బాధితులు ఎంతమందంటే..

ABN , First Publish Date - 2020-03-28T16:49:18+05:30 IST

కరోనా వ్యాప్తిపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 22 కేసుల్లో నెగెటివ్ వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 37 కేసులకు సంబంధించి నివేదికలు

బ్రేకింగ్: ఏపీలో కరోనా బాధితులు ఎంతమందంటే..

అమరావతి: కరోనా వ్యాప్తిపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 22 కేసుల్లో నెగెటివ్ వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 37 కేసులకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉందని పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన 29,264 మందిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 149 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. క్వారంటైన్ కోసం 23,479 బెడ్లు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-03-28T16:49:18+05:30 IST