నంగునూరు పాఠశాలలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-09-19T04:53:43+05:30 IST

నంగునూరు పాఠశాలలో శనివారం కరోనా కలకలం రేపింది. మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలడంతో ఆందోళ మొదలైంది.

నంగునూరు పాఠశాలలో కరోనా కలకలం

నంగునూరు, సెప్టెంబరు 18 : నంగునూరు పాఠశాలలో శనివారం కరోనా కలకలం రేపింది. మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలడంతో ఆందోళ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో చదువుతున్న ఇద్దరు సోదరులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎంఈవో తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు. ఒకటో తరగతి, ఐదో తరగతి చదువుతున్న వారి తండ్రికి ఆరు రోజుల క్రితం కరోనా సోకగా ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. అయితే ఐదు రోజుల నుంచి వారి పిల్లలు పాఠశాలకు హాజరవుతున్నారు. తోటి విద్యార్థులు ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు సురేఖకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆమె ఆ ఇద్దరి విద్యార్థులకు కరోనా టెస్టును చేయించగా వారికి పాజిటివ్‌గా తెలింది. దీంతో పాఠశాల నుంచి విద్యార్థులందరినీ ఇంటికి పంపించారు. వారితో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు విద్యార్థులకు పరీక్షలు చేయించగా వారికి నెగెటివ్‌ వచ్చింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఆదివారం కరోనా పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉపాధ్యాయురాలు తెలిపారు.



Updated Date - 2021-09-19T04:53:43+05:30 IST