కొత్తగా 22 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-05T05:24:54+05:30 IST
జిల్లాలో శుక్రవారం మరో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
జిల్లాలో 58,895కు చేరిన బాధితుల సంఖ్య
విశాఖపట్నం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం మరో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 58,895కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 57,890 మంది కోలుకోగా, మరో 493 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో శుక్రవారం కొవిడ్ మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు 512 మంది వైరస్తో మృత్యువాత చెందారు.