39 కరోనా కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-11-30T05:32:38+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు కొనసాగుతున్నాయి.
నెల్లూరు (వైద్యం)నవంబరు 29 : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు కొనసాగుతున్నాయి. ఆదివారం 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 62,971కి చేరాయి. ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నారాయణ ఆసుపత్రులతో పాటు కొవిడ్ కేర్ సెంటర్లలో కరోనా నుంచి కోలుకున్న 12 మందిని అధికారులు డిశ్చార్జీ చేశారు.