పారిశుద్ధ్య సిబ్బంది పాదాలు కడిగి..!
ABN , First Publish Date - 2020-04-03T09:14:31+05:30 IST
పారిశుద్ధ్య సిబ్బంది పాదాలు కడిగి..!
కాశీబుగ్గ, ఏప్రిల్ 2: కరోనా కట్టడిలో తమవంతు పాత్రపోషిస్తున్న పారిశుద్ధ సిబ్బందిని గౌరవిస్తూ ఓ మెడికల్ రిప్రంజెంటేటివ్ వారి పాదాలను కడిగారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గకు చెందిన మెడికల్ రిప్రంజెంటేటివ్ మణియాల శ్రీను.. పలాస మునిసిపల్ కార్యాలయం వద్ద గురువారం అక్కడి పారిశుద్ధ్య సిబ్బంది పాదాలను నీటితో శుభ్రం చేశారు. అనంతరం ఒక్కొక్కరికి 12.5 కేజీల బియ్యం అందజేశారు.