ఓగూరువాండ్లపల్లిలో 11 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-05-15T05:40:06+05:30 IST
ఓగూరువాండ్లపల్లి గ్రామం లో శుక్రవారం 11 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన
సీతారామపురం, మే 14: ఓగూరువాండ్లపల్లి గ్రామం లో శుక్రవారం 11 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో పరిమితికి మించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించడంతో కరోనా వ్యాపించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రామంలో ఇప్పటివరకు 24 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.