పోలీసుస్టేషన్లో మరో ఐదుగురికి కరోనా
ABN , First Publish Date - 2021-05-07T03:42:51+05:30 IST
సంగం పోలీస్స్టేషన్ సిబ్బందికి 8 మంది కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల కిందట ఇద్దరు ఏఎస్ఐలు, ఒక కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ నమోదైంది.
సంగం, మే 6: సంగం పోలీస్స్టేషన్ సిబ్బందికి 8 మంది కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల కిందట ఇద్దరు ఏఎస్ఐలు, ఒక కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ నమోదైంది. దీంతో కాంట్రాక్ట్ కింద సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి కరోనాగా తేలింది. వీరంతా హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. దీంతో మండల ప్రజలు స్టేషన్కు వెళ్లాలంటే బయపడుతున్నారు. కాగా మండలంలో రెండో రోజు గురువారం కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగిం ది. 12 గంటల నుంచి దుకాణాలన్నీ మూసేశారు. పోలీస్స్టేషన్లో అందుబాటులో ఉన్న సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.