కోరమాండల్ ఆదాయం రూ.5,783 కోట్లు
ABN , First Publish Date - 2022-07-28T08:40:13+05:30 IST
జూన్తో ముగిసిన త్రైమాసికానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.499 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్తో ముగిసిన త్రైమాసికానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.499 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.338 కోట్లతో పోలిస్తే 48 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.ఆదాయం రూ.3,686 కోట్ల నుంచి రూ.5,783 కోట్లకు చేరిందని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ సమీర్ గోయెల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి కంపెనీ పనితీరు బాగుందని.. ఆదాయం 57 శాతం పెరిగింది. న్యూ ట్రియంట్, క్రాప్ ప్రొటెక్షన్ వ్యాపారాల్లో వృద్ధి ఇందుకు దోహదం చేసినట్లు చెప్పారు.