కోరమాండల్ లాభం రూ.234 కోట్లు
ABN , First Publish Date - 2020-05-27T06:45:41+05:30 IST
మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ ఏకీకృత ప్రాతిపదికన
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ ఏకీకృత ప్రాతిపదికన రూ.234 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.110 కోట్లతో పోలిస్తే 112 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.2,647 కోట్ల నుంచి రూ. 2,881 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. స్టాండ్అలోన్ ప్రాతిపదికన మార్చి త్రైమాసికంలో నికర లాభం రూ.107 కోట్ల నుంచి రూ.231 కోట్లకు పెరిగింది.