తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు

ABN , First Publish Date - 2022-01-19T19:54:02+05:30 IST

తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్వేలో తేలింది.

తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు

హైదరాబాద్: తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్వేలో తేలింది. మున్ముందు కేసులు మరింతగా పెరవచ్చునని సర్వే అంచనా వేసింది. ఒమైక్రాన్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని, రానున్న రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. డిసెంబర్ రెండవ వారం నుంచి ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో 20 లక్షల మందికిపైగా కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15 లక్షల మందికి పైగా కేసులు నమోదయ్యాయని, అలాగే జిల్లాల్లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ సర్వే నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి అందజేసింది.

Updated Date - 2022-01-19T19:54:02+05:30 IST