చిన అవుటపల్లిలో పదిమందికి పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-13T06:21:54+05:30 IST
చిన అవుటపల్లిలో పదిమందికి పాజిటివ్
గన్నవరం, ఏప్రిల్ 12 : మండలంలోని చిన అవుటపల్లిలో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామంలో ఆరుగురికి, శివారు లోని అపార్టుమెంట్లలో ఉండే నలుగురికి కరో నా సోకినట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసులు పెరగటంతో సర్పంచ్ గోగులమూడి విజయలక్ష్మి నివారణ చర్యలు సోమవారం చేపట్టారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైడ్రాక్సీక్లోరైడ్ను పిచికారి చేయించారు. కార్యదర్శి జెవి నామేశ్వరరావు, వీఆర్వో జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
181 మందికి కరోనా పరీక్షలు
స్థానిక బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో సోమ వారం ఉపాధ్యాయులకు, సిబ్బంది, విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ముస్తాబాద పీహెచ్సీ వైద్యులు టి.శివ ప్రసాద్ ఆధ్వర్యంలో 181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారికి మంగళవారం పరీక్షలు చేస్తామని తెలిపారు. ఇన్చార్జి హెచ్ఎం ఏసుబాబు, పీడీలు చంద్రశేఖర్, ధనియాల నాగరాజు పాల్గొన్నారు.