కరస్పాండెంట్‌ లైంగిక వేధింపులు ..!

ABN , First Publish Date - 2021-11-20T15:56:11+05:30 IST

కళాశాల కరస్పాండెంట్‌ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థినులు రాస్తారోకో చేప ట్టారు. దిండుగల్‌- పళని రోడ్డు సమీపంలో ముత్తంపట్టి ప్రాంతంలో నర్సింగ్‌ కళాశాల ఉంది. దిండుగల్‌కు చెంది

కరస్పాండెంట్‌ లైంగిక వేధింపులు ..!

                        - విద్యార్థినుల రాస్తారోకో


పెరంబూర్‌(చెన్నై): కళాశాల కరస్పాండెంట్‌ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థినులు రాస్తారోకో చేప ట్టారు. దిండుగల్‌- పళని రోడ్డు సమీపంలో ముత్తంపట్టి ప్రాంతంలో నర్సింగ్‌ కళాశాల ఉంది. దిండుగల్‌కు చెందిన జ్యోతిమురుగన్‌ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలో సుమారు 250 మంది విద్యార్థినులు చదువుతున్నారు. విద్యార్థినులపై కరస్పాండెంట్‌ జ్యోతిమురుగన్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యహారంపై శుక్రవారం ఉదయం సుమారు వంద మందికి పైగా విద్యార్థినులు హెల్స్‌ లైన్‌ నెంబరు ‘1098’కు ఫిర్యాదు చేశారు. అనంతరం సుమారు 200 మంది విద్యార్థినులు కళాశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై భైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వీఆర్‌ శ్రీనివాసన్‌, అసిస్టెంట్‌ ఎస్పీ అరుణ్‌కబిలన్‌ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థినులతో చర్చించారు. ఈ వ్యహారంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జ్యోతిమురుగన్‌ కోసం గాలిస్తున్న పోలీసులు హాస్టల్‌ వార్డెన్‌ అర్చనను అరెస్ట్‌ చేశారు. అలాగే, జ్యోతిమురుగన్‌ తండ్రి పళనిస్వామి, ఆయన కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2021-11-20T15:56:11+05:30 IST