పాతనోట్లకు యువకుల పూజలు
ABN , First Publish Date - 2020-12-01T04:03:14+05:30 IST
పాతనోట్లకు యువకుల పూజలు
రద్దయిన నోట్లకు పూజలు చేస్తే కొత్త నోట్లొస్తాయని నమ్మకం
అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు
షాద్నగర్ రూరల్: పాత(రద్దయిన) కరెన్సీ నోట్లకు పూజలు చేస్తే కొత్త నోట్లు వస్తాయనే నమ్మకంతో కొందరు యువకులు పాత రూ.500 నోట్లకు పూజలు నిర్వహిస్తుండగా సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 13మంది యువకులు వారి వద్ద ఉన్న రద్దయిన ఆరు రూ.500 నోట్లను జమచేసి ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట శివారులోని ఓ తోటలో ఆదివారం రాత్రి పూజలు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు షాద్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్కుమార్ తెలిపారు. రద్దయిన కరెన్సీని ఎవరూ తమ వద్ద ఉంచుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.