ఆదిలాబాద్‎లో కార్డన్‌ సెర్చ్‌లో పలు వాహనాలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-11T12:07:27+05:30 IST

ఆదిలాబాద్‌ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి నిర్మూలించేందుకు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో ఆకస్మిక తనిఖీలు చేయగా

ఆదిలాబాద్‎లో కార్డన్‌ సెర్చ్‌లో పలు వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి నిర్మూలించేందుకు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో ఆకస్మిక తనిఖీలు చేయగా అనుమానాస్పద ఇంట్లో తనిఖీలు చేపట్టడంలో పాటు స్థానికుల ఫిర్యాదు మేరకు నిజ ధ్రువపత్రాలు లేని, పెండింగ్‌ చలాన్లు ఉన్న 56 బైక్లు, 11 ఆటోలు, నాలుగు ట్రాక్టర్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మూడు బెల్ట్‌షాపుల్లో రూ.10 వేల విలువైన లిక్కర్‌, గుట్కా విక్రేత వద్ద రూ.2వేల గుట్కా ప్యాకెట్లు, 30 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌ స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఆధ్వర్యం లో 10మంది పోలీసు అధికారులు, 60మంది సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఇందులో రూరల్‌ సీఐ పురుషోత్తమచారి, ఎస్సైలు హరిబాబు, షేక్‌ ఫరీద్‌, కేంద్రే రవీందర్‌, ప్రవీన్‌ కుమార్‌ముత్తే, మహిళా ఎస్సై దడిక రాధిక, మాలవేణి ప్రవళిక, కె.ధనశ్రీ, కుడికల స్రవంతి, తదితర సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-11-11T12:07:27+05:30 IST