జిల్లాలో పలుచోట్ల కార్డన్ సెర్చ్
ABN , First Publish Date - 2021-10-19T04:54:23+05:30 IST
జిల్లాలో పలుచోట్ల కార్డన్ సెర్చ్
శంభునిపేట, అక్టోబరు 18: మామునూరు పోలీ్సస్టేషన్ పరిధిలోని రంగశాయిపేట గణే్షనగర్, శేషాద్రినగర్ కాలనీల్లో సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీల్లోని ఇళ్లలో విస్తృతంగా సోదాలు చేశారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈస్ట్ జోన్ డీసీపీ కె.వెంకటలక్ష్మి, మా మునూరు ఏసీపీ ఎ.నరే్షకుమార్ ఈ సందర్భంగా తెలిపారు. తనిఖీల్లో మామునూరు సీఐ బి.రమేష్, గీసుకొండ సీఐ ఆర్.వెంకటేశ్వర్లు, పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్, సంగెం, ఐనవోలు, పర్వతగిరి ఎస్సైలు, 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నెక్కొండ : ప్రజల క్షేమం కోసం పోలీసులు చేస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ పోలీసులకు సహకరించాలని నర్సంపేట ఏసీపీ ఫణిందర్ అన్నారు. సోమవారం రాత్రి నెక్కొండలో నర్సంపేట డివిజన్ పోలీసు అధికారులు కార్డన్సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారాల వల్ల యువత బానిసలుగా మారుతున్నారన్నారు. అలాగే నంబర్ ప్లేట్స్ విషయంలో కొం తమంది వాహనదారులు పోలీసులను తప్పుతోవ పట్టిస్తున్నారని అలాంటి వ్యక్తు లను గుర్తించి శిక్షిస్తామన్నారు. ఈ సెర్చ్లో మద్యం బాటిళ్లు, బెల్లంతో పా టు 44 ద్విచక్ర, 5 ఫోర్ వీలర్లు, 2 ఆటోలు, ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నా రు. ఏసీపీ లు తిరుమల్, కరుణసాగర్రెడ్డి, దుగ్గొండి సీఐ సతీష్బాబు, నెక్కొండ సర్పంచ్ యమునారెడ్డి, వైస్ఎంపీపీ పుండరీకం, ఉపసర్పంచ్ వీరభద్రం, ఎంపీటీసీ కరిష్మా, నెక్కొండ, దుగ్గొండి, ఆత్మకూరు, నర్సంపేట, ఖానాపురం ఎస్సైలు నాగరా జు, నవీన్కుమార్, రాజన్బాబు, రవీందర్, సాయిబాబా సిబ్బంది పాల్గొన్నారు.