ట్రాన్స్ఫార్మర్లో రాగితీగ అపహరణ
ABN , First Publish Date - 2021-10-27T06:16:02+05:30 IST
మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని తమ్మలూరులో సోమవారం రాత్రి బంకా నాగిరెడ్డికి చెందిన 25 కెపాసిటీ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో రాగితీగ చోరికి గురైంది.
ముండ్లమూరు, అక్టోబరు 26 : మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని తమ్మలూరులో సోమవారం రాత్రి బంకా నాగిరెడ్డికి చెందిన 25 కెపాసిటీ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో రాగితీగ చోరికి గురైంది. ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి అనంతరం ఆ ట్రాన్స్ఫార్మర్లో రాగితీగను చోరీ చేశారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. పసుపుగల్లులో మూడు, శంకరాపురంలో ఒకటి, నాయుడుపాలెం ఒకటి, ఉమామహేశ్వర అగ్రహారంలో ఒకటి, తమ్మలూరులో ఒకటి, సింగనపాలెం ఒకటి, నాయుడుపాలెం ఒకటి చొప్పున ట్రాన్స్ఫార్మర్లలో రాగితీగ చోరి జరిగింది. గుర్తు తెలియని దొంగలు రాత్రి వేళలో దిమ్మెల మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కిందకు పడవేసి అందులో ఉన్న రాగి తీగ, ఆయిల్ను తీసుకువెళ్తున్నారు. తిరిగి ట్రాన్స్ఫార్మర్ను బిగించాలంటే.. 20 రోజుల సమయం పడుతోందని రైతు లు వాపోతున్నారు. దీనిపై రైతులు విద్యుత్శాఖ అది కారులకు ఫిర్యాదు చేయడం, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం రివాజుగా మారిం ది. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ చోరీలను నిలువరించాలని రైతులు కోరుతున్నారు.